డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్య..

చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సాయి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తట్టుకోలేకనే ఇతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. పోలీసుల వివరాల ప్రకారం..దుర్గం చెరువులో సాయి కుమార్ అనే వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయి కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. ఆ తర్వాత పోలీసులు ఆత్మహత్య చేసుకున్న సాయి కుమార్ గురించి ఆరా తీయగా అతను గతంలో పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినట్లు గుర్తించారు. అయితే ఇప్పుడు పూరీ జగన్నాథ్ దగ్గర పని చేస్తున్నాడా లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు.

కానీ ఆయన గత కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడని ఈ నేపథ్యంలోనే ఆ ఇబ్బందులు తట్టుకోలేక దుర్గం చెరువులో దూకి ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని మాదాపూర్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఇక ఇటీవలే పూరి జగన్నాథ్ లైగర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.