పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సినీ నటి పూర్ణ

సీమా టపాకాయ్ ఫేమ్ నటి పూర్ణ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. శ్రీమహాలక్ష్మి ఫిల్మ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత వరుసగా పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. కేవలం వెండితెర ఫై మాత్రమే కాదు బుల్లితెర ఫై కూడా మెరిసింది. గత ఏడాది అక్టోబర్ లో ఈమె దుబాయ్ లో స్థిరపడిన వ్యాపారవేత్త జేబీఎస్ గ్రూప్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో శానిద్ ఆసిఫ్ ఆలీని షమ్న కాసిం ను పెళ్లి చేసుకొని ఓ ఇంటిది అయ్యింది. దుబాయ్ లో వీరి వివాహం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. పెళ్ళైన రెండు నెలలకే తాను తల్లి కాబోతున్నట్లు తెలిపి షాక్ ఇచ్చింది.

ఇక ఈరోజు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. పూర్ణ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులు , ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందజేస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే నాని తాజా చిత్రం ‘దసరా’లో ఆమె నటించింది.