నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..25 మంది ప్రయాణికులకు గాయాలు

శుక్రవారం నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్‌ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుంది. ఈ క్రమంలో నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామశివారులో జాతీయ రహదారి పై ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను అతివేగంగా ఢీ కొట్టింది.

దీంతో బస్సులో ఉన్న 25 మందికి గాయాలు కాగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ ప్రయాణికులను కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.