పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆటోను ఢీకొన్న లారీ..5 మంది మృతి

పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న, ఎలాంటి చర్యలు పాటించిన రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తూనే ఉన్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో బుధువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 10 మందికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన దాచేపల్లి మండలం పొందుగల వద్ద చోటుచేసుకుంది.

నల్గొండ జిల్లాకు చెందిన కూలీలంతా గురజాల మండలం పులిపాడుకు కూలీపనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఆటోలో 23 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురం వాసులుగా గుర్తించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి , దర్యాప్తు మొదలుపెట్టారు.