ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట
![](https://www.vaartha.com/wp-content/uploads/2022/06/ab-venkateswara-rao-has-been-appointed-as-the-printing-and-stationery-commissioner.jpg)
అమరావతి: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. క్యాట్ (కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్) ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఇటీవల క్యాట్ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. క్యాట్ ఉత్తర్వులను నిలుపుదల చేసేందుకు నిరాకరించింది. అందులో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.