తెలంగాణలో కొత్తగా 857 పాజిటివ్‌ కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,51,188…మొత్తం మృతుల సంఖ్య 1381

corona virus – telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 857 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,504 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,51,188 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,30,568 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1381 కి చేరింది. ప్రస్తుతం 19,239 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 16,449 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 250 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 112 కేసులు నిర్ధారణ అయ్యాయి ఈ మేరకు ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/