స్నేహానికే మచ్చ ..స్నేహితుడి భార్య తో అక్రమ సంబంధం..

ఈరోజుల్లో స్నేహం అనే పదానికి మచ్చ తెస్తున్నారు కొందరు. తమ స్వార్థం కోసం స్నేహం ముసుగులో ప్రవర్తిస్తూ దారుణాలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో స్నేహం పేరుతో స్నేహితుడి భార్య తో అక్రమ సంబంధం పెట్టుకొని..చివరికి స్నేహితుడి చేతిలోనే హత్య చేయబడ్డాడు.

కూకట్‌పల్లి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే…

శ్రీశైలం యాదవ్‌(32), శ్రీకాంత్‌ యాదవ్‌ ఇద్దరూ పాల వ్యాపారం చేస్తుంటారు. దూరపు బంధువుల కావడంతో వీరి మధ్య చాలా ఏళ్లుగా స్నేహం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ యాదవ్ తరుచూ శ్రీశైలం యాదవ్ ఇంటికి వచ్చి వెళ్తుండేవారు. దీంతో శ్రీశైలం భార్యతో చనువు పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. స్నేహితుడు ఇంట్లో లేని సమయంలో శ్రీకాంత్ తరుచూ వస్తూ అతడి భార్యతో రాసలీలలు కొనసాగించేవాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీశైలం.. భార్యను గట్టిగా మందలించాడు. అయినప్పటికీ వారిద్దరి మధ్య సంబంధం కొనసాగుతుండటంతో శ్రీకాంత్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అక్టోబర్ 01 న గేదె తప్పిపోయిందని వెతకడానికని నమ్మించి శ్రీకాంత్‌ను బైక్‌పై వెంట తీసుకెళ్లాడు. ఐడీఎల్‌ కంపెనీకి చెందిన ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి రాడ్‌తో శ్రీకాంత్‌ తలపై బలంగా మోది చంపేశాడు. శ్రీకాంత్ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. శ్రీశైలం కూడా ఏమీ ఎరగనట్టుగా అందరితో కలిసి సాధారణంగా తిరిగాడు. అయితే బైక్‌పై తీసుకెళ్లిన శ్రీశైలమే అతడిని ఏదో చేసి ఉంటాడని అనుమానించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. మొదట తనకేమీ తెలియదని చెప్పిన నిందితుడు ఆ తర్వాత నేరాన్ని అంగీకరించాడు.