75 జిల్లాలు లాక్ డౌన్

కేంద్రం కీలక నిర్ణయం

75 Districts Lockdown

New Delhi: కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కేంద్రం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది.

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 75 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించింది.

ఈ నెల 31 వరకూ దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో మెట్రో రైళ్లను, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర కేబినెట్ కార్యదర్శి, ప్రధాని ప్రిన్సిపల్ కార్యదర్శులు సంయుక్తంగా ఈ రోజు రాష్ట్రాల సీఎస్ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు .

తాజా అంతర్జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/international-news/