దేశంలో కొత్తగా 7,171 కరోనా కేసులు

corona virus -india

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల్లో 7 వేలకుపైనే కొత్త కేసులు నమోదయ్మాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 1,94,134 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 7,171 మందికి పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం దేశంలో 51,314 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ఇక ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.11 శాతం యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.70 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.