దేశంలో కొత్త‌గా 71,365 క‌రోనా కేసులు

మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 5,05,279

న్యూఢిల్లీ: దేశంలో కొత్త‌గా 71,365 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న క‌రోనా వ‌ల్ల 1,217 మ‌ర‌ణాలు సంభ‌వించాయని పేర్కొంది. క‌రోనా నుంచి నిన్న 1,72,211 మంది కోలుకున్నారని, ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 8,92,828 మంది క‌రోనాకు చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది.

క‌రోనా వ‌ల్ల సంభ‌వించిన‌ మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 5,05,279గా ఉందని వివ‌రించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉందని చెప్పింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 170,87,06,705 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/