వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 7 మంది మృతి

నిత్యం రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. అతి వేగం , మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి చేయడం తో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు.

ఆదిలాబాద్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నూర్ మండలంలో సీతాగొంది దగ్గర కారు-కంటైనర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు శంషోద్దిన్ (డ్రైవర్), సయ్యద్ రఫముల్లా అహ్మద్, శభియా హష్మీ, సయ్యద్ వజాహద్‎, మృతులంతా ఆదిలాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.

అలాగే హైదరాబాద్‌ నగర శివార్లలోని మేడ్చల్ ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన టెంపో వాహనం.. కండ్లకోయ వద్ద జాతీయ రహదారిపై లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.