బీహార్‌లో దారుణ ఘటన : బాలికను బాధించి 28 రోజుల పాటు అత్యాచారం

దేశంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. కోర్టులు , పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ వారిలో భయం , మార్పు అనేది రావడం లేదు. ఒంటరి మహిళలనే కాదు అమాయకపు బాలికలను సైతం వదిలిపెట్టడం లేదు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటన వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా బీహార్‌లో దారుణం జరిగింది. ఓ బాలికను కామాంధులు 28 రోజుల పాటు చెరపట్టి అఘాయిత్యానికి ఒడిగట్టారు. ముజఫర్‌పూర్‌లో సరైయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

గత నెల 9న కొందరు దుండగులు కారులో వచ్చి ఓ 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. శిథిలావస్థకు చేరుకున్న ఓ భవనంలో బాలికను బంధించి 28 రోజుల పాటు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక ఆరోగ్యం విషమించడంతో ఆగస్టు 5న ఆమె తల్లికి ఫోన్ చేసి చిన్నారిని కిడ్నాప్ చేసిన విషయాన్ని వెల్లడించారు. వెంటనే అక్కడకు చేరుకున్న మహిళ తన కూతురుని ఆసుపత్రికి తరలించింది. జులై 9న తాను ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు వేగంగా స్పందించి ఉంటే తన కూతురికి ఈ గతి పట్టేది కాదంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరు అవుతుంది.