దేశంలో కొత్తగా 5,676 కరోనా కేసులు

ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 37,093

india-corona virus-cases

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5676 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 21 మంది కరోనాకాటుకు బలయ్యారు. అయితే.. సోమవారం నాటి కేసులతో (5880) పోలిస్తే నేడు రోజువారీ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 37,093. ఇప్పటివరకూ దేశంలో మొత్తం 44,200,079 మంది కరోనా కోరల నుంచి బయటపడగా రికవరీ రేటు 98.73 శాతంగా నమోదైంది. ఇక దేశంలో కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ 220.66 కరోనా టీకా డోసుల పంపిణీ జరిగినట్టు పేర్కొంది.