సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ గురువారం వెల్లడైంది. నాలుగో విడత పోలింగ్ కోసం ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నాలుగో విడతలో ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు కేటాయించారు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. తెలంగాణలో ఎంపీ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక జరగనుంది.