ఏపిలో మరో 462 కొత్త పాజిటివ్ కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,834
అమరావతి: ఏపిలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతునే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 462 కొత్త కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. వీటిలో 407 స్థానికులకు, విదేశాల నుంచి వచ్చిన 15 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 40 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏపి వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన బులెటిన్లో వెల్లడించారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు కరోనాతో మరణించారు. అటు కర్నూలు జిల్లాలోనూ ముగ్గురు ఈ మహమ్మారికి బలయ్యారు. గుంటూరు జిల్లాలో ఒకరు, కడప జిల్లాలో ఒకరు మరణించగా, రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 119కి పెరిగింది. కాగా ఇప్పటివరకు ఏపిలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 9,834కి చేరింది. 129 మందిని డిశ్చార్జి చేయగా, మొత్తం 4,592 మంది కరోనా నుంచి కోలుకున్నట్టయింది. ఇంకా 5,123 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/