తమిళనాడులో గోడ కూలి 9 మంది మృతి

చెన్నై: తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో శుక్రవారం గోడ కూలడంతో నలుగురు పిల్లలతో సహా 9 మంది మరణించారు. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేర్నంపట్టు ప్రాంతంలో ఒక ఇంటి గోడ కూలింది. ఈ ఘటనలో నలగురు పిల్లలతో సహా 9 మంది చనిపోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. పలువురు గాయపడ్డారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, గోడ కూలిన ఆ ప్రాంతంలో 50కిపైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. సీఎం స్టాలిన్‌ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/