ఇది రైతులు సాధించిన గొప్ప విజయం : వైఎస్ షర్మిల

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించిన నేపధ్యంలో తెలంగాణ వైఎస్ఆర్ సీపీ ప్రెసిడెంట్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజలను భాగస్వామ్యం చేయకుండా చేసిన ఏ చట్టమైనా జనాగ్రహానికి గురికావాల్సిందేనని షర్మిల పేర్కొన్నారు. రైతులను భాగస్వామ్యం చేయకుండా….రైతుల అనుమానాలు తొలగించకుండా, రైతులకు భరోసా కల్పించకుండా, రైతుల నెత్తిన రుద్దిన చీకటి చట్టాలను ఇప్పడికైనా రద్దు చేసినందుకు సంతోషం. ఇది రైతులు సాధించిన గొప్ప విజయంగా ఆమె అభివర్ణించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/