జనసేన పార్టీ కి సపోర్ట్ గా మాట్లాడిన వైసీపీ నేత 30 ఇయర్స్ పృథ్వీ

మాజీ ఎస్వీబీసీ ఛైర్మన్,టాలీవుడ్‌లో 30 ఇయర్స్‌ ఇండస్ట్రీగా పేరు తెచ్చుకున్న పృథ్వీ జనసేన పార్టీ కి సపోర్ట్ గా మాట్లాడి ఆశ్చర్య పరిచారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ 40 సీట్లు గెలువబోతుందని , 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కింగ్ అంటూ చెప్పుకొచ్చారు. చిత్రసీమలో ఎంతో పేరు , గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల్లో అభిమానం చొరగొన్న పృథ్వీ..గత ఎన్నికల సమయంలో వైస్సార్సీపీ పార్టీ కి మద్దతు ఇచ్చి , ప్రచారం చేసారు. పార్టీ గెలుపులో తనవంతు కృషి చేసారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పృథ్వీకి ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి అప్పగించారు. కానీ పదవి చేపట్టిన అతి తక్కువ రోజుల్లోనే పలు కారణాలతో ఆ పదవికి రాజీనామా చేసి మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు.

ప్రస్తుతం ఏపీలో రాజకీయ పార్టీలు బిజీ కావడం , వరుసగా నేతలు రాష్ట్ర వ్యాప్త టూర్ లకు సిద్దమవుతున్న తరుణంలో పృథ్వీ ..పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా మాట్లాడడం ఇప్పుడు చర్చ గా మారింది. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ 40 సీట్లు గెలువబోతుందని అని జోస్యం చెప్పారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కింగ్ అంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి నాయకుడు కావాలి జనాల కోసం పోరాడే నాయకుడు కావాలని ఆయన మార్పు ప్రజల్లో వచ్చిందండి.. అది నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను పృథ్వి రాజ్ చెప్పుకొచ్చారు. మొన్నటి వరకు వైసీపీ కి సపోర్ట్ గా నిలిచిన పృథ్వీ..సడెన్ గా ఇప్పుడు జనసేన కు సపోర్ట్ గా మాట్లాడేసరికి అదేంటి అని అంత మాట్లాడుకుంటున్నారు.