భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం : మొక్కజొన్న గింజలు గొంతులో ఇరుక్కొని 3 ఏళ్ల బాలిక మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మొక్కజొన్న గింజలు గొంతులో ఇరుక్కొని 3 ఏళ్ల బాలిక మృతి చెందింది. రాంపురం గ్రామానికి చెందిన వెంకటకృష్ణ- అభశ్విని దంపతుల కుమార్తె బిందుశ్రీ (3) మంగళవారం రాత్రి ఇంట్లో ఆడుకుంటోంది. అప్పుడే వెంకటకృష్ణ, అశ్విని భోజనం చేస్తున్నారు.

అంతకుముందు మొక్కజొన్న కంకులు తెచ్చుకుని తినడంతో కొన్ని కిందపడ్డాయి. వీటిని చూసిన బిందుశ్రీ తినగా గొంతులో అడ్డుపడడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడింది. వెంటనే తల్లిదండ్రులు కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని, ఖమ్మం, హైదరాబాద్ తరలించాలని అక్కడి డాక్టర్లు సూచించారు. దీంతో వెంకటకృష్ణ డబ్బుల కోసం తిరిగి తిరిగి హైదరాబాద్ తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పాప ప్రాణం పోయింది. కళ్ల ముందు కన్నా కూతురు మరణించడం తో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నియారు అవుతున్నారు. ఈ ఘటన ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది.