తెలంగాణలో కొత్తగా 298 కరోనా కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,433
Hyderabad: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు గత 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రంలో కొత్తగా 298 కరోనా కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో ఇద్దరు కరోనా కాటుకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,433కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 1563కి పెరిగింది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/