టీవీ సీరియల్‌ మోజులోపడి మహిళ సజీవ దహనం

Woman burned in fire accident
Woman burned in fire accident

తమిళనాడు: టీవీ సీరియల్‌ చూస్తూ, దానిలోనే నిమగ్నమైన పోయింది ఓ మహిళ. మరోవైపు ఇంటికి నిప్పంటుకుని ఇళ్లంతా తగలబడి పోతూ ఉంటే కూడా పట్టించుకోలేదు. అయితే మంటలను గమనించిన వెంటనే ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ సజీవ దహనం అయ్యింది. తమిళనాడులోని తిరువొత్తియూరు సమీపంలో ఈ ఘటన జరిగింది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… ఇక్కడి కామరాజపురం, భగత్ సింగ్ స్ట్రీట్ కు చెందిన రమేశ్, మహాలక్ష్మి (41) దంపతులు కాగా, మహాలక్ష్మి భర్తతో విడిపోయి, తన బంధువుల ఇంట్లో అద్దెకు ఉంటోంది. సాయంత్రం ఇంటిలో దీపం వెలిగించిన ఆమె, టీవీ సీరియల్ చూసేందుకు కిందకు దిగింది. దీపం ఒరిగి ఇంటికి మంటలు అంటుకోగా, వాటిని ఆర్పే ప్రయత్నంలో ఆమెకు మంటలు అంటుకుని సజీవ దహనమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/