కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత
ముషీరాబాద్ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు
Hyderabad: తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ముషీరాబాద్ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముషీరాబాద్ లో నిర్మించినఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. కేటీఆర్ పర్యటనలో ప్రొటోకాల్ పాటించలేదంటూ బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా కేటీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశాయి.
దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు మోడీ వ్యతిరేక నినాదాలు చేశారు. అలాగే కేటీఆర్ కాన్వాయ్ ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పోలీసులు రంగ ప్రవేశం చేతి బీజేపీ కార్యకర్తలను అడ్డుకుని పక్కకు తీసుకు వెళ్లారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/