దేశంలో కొత్తగా 27,409 కరోనా కేసులు

మొత్తం 173.42 కోట్ల డోసుల వ్యాక్సిన్ల వినియోగం

న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. మొన్న‌ దేశంలో 34,113 కరోనా కేసులు న‌మోదు కాగా, నిన్న 27,409 కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వివ‌రాలు తెలిపింది. క‌రోనా నుంచి నిన్న‌ 82,817 మంది కోలుకున్నార‌ని వివ‌రించింది.

క‌రోనా వ‌ల్ల నిన్న‌ 347 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనాకు 4,23,127 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.23 శాతంగా ఉంది. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,17,60,458గా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 173.42 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/