ఏపీలో కొత్తగా 215 కరోనా పాజిటివ్ కేసులు

గత 24 గంటల్లో 30,831 కరోనా పరీక్షలు

అమరావతి : ఏపీలో గడచిన 24 గంటల్లో 30,831 కరోనా పరీక్షలు నిర్వహించగా, 215 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 37 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 33, విశాఖ జిల్లాలో 27, తూర్పు గోదావరి జిల్లాలో 26, గుంటూరు జిల్లాలో 24 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి.

అదే సమయంలో 406 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,67,921 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,49,961 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,568 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,392కి పెరిగింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/