దేశంలో కొత్తగా 2,09,918 క‌రోనా కేసులు

యాక్టివ్ కేసులు 18,31,268

న్యూఢిల్లీ : దేశంలో క‌రోనా కేసులు మొన్న‌టి కంటే త‌క్కువగా న‌మోద‌య్యాయి. నిన్న దేశంలో 2,09,918 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. క‌రోనాతో 959 మంది ప్రాణాలు కోల్పోయార‌ని చెప్పింది.

అలాగే, క‌రోనా నుంచి నిన్న 2,62,628 మంది కోలుకున్నార‌ని వివ‌రించింది. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనాకు 18,31,268 మంది చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 15.77 శాతంగా ఉంది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 166,03,96,227 డోసుల వ్యాక్సిన్లు వేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/