మహారాష్ట్రలోని నాందేడ్ బయల్దేరిన సిఎం కెసిఆర్
హైదరాబాద్ః సిఎం కెసిఆర్ నాందేడ్ బయలుదేరారు. మహారాష్ట్రలోని నాందేడ్లో బిఆర్ఎస్ పార్టీ తొలిసారిగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నది. రెండురోజులపాటు జరుగున్న ఈ కార్యక్రమాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభిస్తారు. ఈ మేరకు కెసిఆర్ ప్రత్యేక విమానంలో నాందేడ్ బయలుదేరారు. మరికాసేటపట్లో మరఠ్వాడకు సిఎం కెసిఆర్ చేరుకోనున్నారు.
కాగా, శిక్షణ శిబిరం నిర్వహించే అనంత్లాన్స్ వేదిక మొత్తం గులాబీ మయమైంది. నాందేడ్ వ్యాప్తంగా కెసిఆర్కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు వెలిశాయి. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్, దేశ్ కీ నేత కైసే హో కెసిఆర్ జైసే హో.. దేశ్ కీ నేత కెసిఆర్ వంటి నినాదాలతో ఫ్లెక్సీలు ఆకర్షిస్తున్నాయి. నాందేడ్ విమానాశ్రయం నుంచి అనంత్లాన్స్ మార్గంతోపాటు రైల్వేస్టేషన్ సహా ప్రధాన కూడళ్లలో గులాబీ ఫ్లెక్సీలు సందడి చేస్తున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు శిక్షణా శిబిరాలకు తరలివచ్చారు.