డ్రింక్ అనుకొని టిన్నర్ కెమికల్ తాగిన రెండేళ్ల చిన్నారి

తల్లిదండ్రుల నిర్లక్ష్యం రెండేళ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. ఇంట్లో పెళ్లి వేడుక సందర్భంగా తలుపులకు రంగులు వేస్తుండగా తెలియక టిన్నర్ తాగింది. వెంటనే పాపను హాస్పటల్ కు తీసుకెళ్లిన ఫలితం దక్కలేదు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం జాఫర్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు వారు ఏంచేస్తున్నారో..ఎటు వెళ్తున్నారో..ఏం తింటున్నారో కనిపెడుతూ ఉండాలి. చిన్న ఏమరపాటు పెద్ద విషాదాన్ని నింపుతుంది. తాజాగా జాఫర్ పల్లి గ్రామంలో అదే జరిగింది. ఇంట్లో పెళ్లి వేడుక సందర్భంగా వేడుకల్లో కుటుంబ సభ్యులు బిజీ గా ఉన్నారు. తలుపులకు రంగులు వేస్తుండగా సౌమ్య (2) తెలియక కూల్ డ్రింక్ అనుకోని టిన్నర్ తాగింది. వెంటనే తల్లిదండ్రులు వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తీసుకెళ్ళినప్పటికీ ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ పాప మృతి చెందింది. దీంతో పెళ్లి ఇంట పెను విషాదం నెలకొంది. అప్పటివరకు తమ కళ్ల ముందు ఉన్న బిడ్డ.. ఇక లేదు అనేది తట్టుకోలేకపోతున్నారు.