తెలంగాణాలో కొత్తగా 1,931 కేసులు నమోదు

86,475 చేరుకున్న కరోనా కేసులు

corona virus

హైదరాబాద్‌:  తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది.  ఈ రోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న కొత్తగా 23,303 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,931కి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 86,475కు పెరిగింది. నిన్న కొత్తగా 11 మంది కరోనా  కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 665కు పెరిగింది. ఇక, నిన్న కొత్తగా 1,780 కరోనా నుంచి బయటపడ్డారు. ఫలితంగా ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారి నుంచి బయటపడిన వారి సంఖ్య 63,074కు పెరిగింది. రాష్ట్రంలో ఇంకా 22,736 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది. అలాగే, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,89,150 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.  

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/