దేశంలో కొత్తగా 1,839 కరోనా కేసులు

corona virus

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 1,800 కేసులు బయటపడ్డాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 73,706 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,839 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో దేశంలో కొవిడ్‌ బారిన పడిన వారి సంఖ్య 4,49,71,469 కి చేరింది. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 25 వేలకు పడిపోయింది. ప్రస్తుతం 25,178 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 3,861 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,44,14,599కి చేరింది. కొవిడ్‌ కారణంగా ఒక్కరోజే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,692కి ఎగబాకింది.

ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.06 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.76 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,79,735 ) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.