తెలంగాణలో కొత్తగా 1,802 కేసులు
మొత్తం కేసులు 1,42,771
హైదరబాద్: తెలంగాణలో కొత్తగా 1,802 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,771 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,42,771 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,10,241 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 895 కు చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 245 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వివరాలను వెల్లడించింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీలో 245, రంగారెడ్డిలో 158, కరీంనగర్ 136, సిద్దిపేటలో 106, సంగారెడ్డిలో 103 మందికి కరోనా సోకిందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/