దేశంలో కొత్త‌గా 1,72,433 క‌రోనా కేసులు

యాక్టివ్ కేసులు 15,33,921

న్యూఢిల్లీ: దేశంలో కొత్త‌గా 1,72,433 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొన్న‌ న‌మోదైన కేసుల కంటే నిన్న న‌మోదైన కేసులు 6.8 శాతం అధికంగా ఉన్నాయి. నిన్న క‌రోనా నుంచి 2,59,107 మంది కోలుకున్నారు.

క‌రోనా వ‌ల్ల నిన్న 1,008 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం దేశంలో 15,33,921 మంది క‌రోనాకు హోం క్వారంటైన్లు, ఆసుప‌త్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. మ‌ర‌ణాల సంఖ్య‌ 4,98,983గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 10.99 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 167.87 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/