దేశంలో కొత్తగా 17,073 కరోనా కేసులు

యాక్టివ్​ కేసులు.. 94,420

corona virus- india

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 17,073 మంది వైరస్​ బారినపడగా.. మరో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 15,208 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.57 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.22 శాతం వద్ద ఉంది. భారత్​లో ఆదివారం 2,49,646 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,97,11,91,329 కోట్లకు చేరింది. మరో 3,03,604 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

ప్రపంచదేశాల్లో కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 290,919 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 515 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 548,640,377కు చేరింది. మరణాల సంఖ్య 6,350,835కు చేరింది. ఒక్కరోజే 346,304 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 523,861,606గా ఉంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/