క్షుద్ర పూజల అనుమానం యువతీ ప్రాణాలు తీసుకునేలా చేసింది

టెక్నలాజి రోజు రోజుకు ఎంతగానో అభివృద్ధి జరుగుతుంటే..కొంతమంది లో మాత్రం మూఢనమ్మకాలు వదలడం లేదు. ఆఖరికి ప్రాణాలు తీసుకునేలా చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ మహానగరంలో ఇదే జరిగింది. హైదరాబాద్ కుల్సుంపురాలో 16 యేళ్ల బాలిక ఇంటి ముందు ఉన్న నిమ్మకాయలు, నల్ల బొమ్మలు చూసి భయపడి చివరకు ప్రాణాలు తీసుకునేలా చేసింది.

జూన్ 1 గురువారం ఆమావాస్య రోజు నవ్య (16) కు ఇంటిముందు నిమ్మకాయలు, నల్ల బొమ్మలు కనిపించాయి. ఆ రోజు వాటిని చూసిన నవ్య తీవ్ర భయాందోళనలకు గురయ్యింది. అప్పటి నుండి రోజు భయపడుతూనే ఉంది. ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోయింది. ఎటు వెళ్లిన తోడు తీసుకుని వెళ్ళింది.
జూన్ 7వ తేదీన బుధవారం మళ్లీ నవ్య ఇంటి ముందు నిమ్మకాయలు, కుంకుమ కనిపించాయి. వాటిని చూసిన నవ్య మరోసారి భయాందోళనకు గురైంది. నవ్యనే వాటిని ఇంటిముందు నుంచి ఊడ్చేసి, కాల్చేసింది. ఆ తర్వాత స్నానం చేసిన నవ్య కొద్దిసేపు కుటుంబ సభ్యులతో గడిపింది. నవ్య అక్క వంట చేస్తుండగా గుడ్లు తీసుకొచ్చి ఇచ్చింది. ఈ సమయంలో 5 నిమిషాల్లో వస్తా అని వంట గదిలో నుంచి మరో గదిలోకి వెళ్లి..అక్కడ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు..అసలు ఇంటి ముందు నిమ్మకాయలు, నల్ల బొమ్మలు ఎవరు వేశారనే విచారణ చేపట్టారు.