దేశంలో కొత్తగా 1,331 కరోనా కేసులు

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల్లో 1,44,767 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,331 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,49,72,800కి చేరింది. ప్రస్తుతం దేశంలో 22,742 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,44,18,351 మంది కోలుకున్నారు. ఇక నిన్న ఒక్కరోజే 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,707కి చేరింది.

ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.05 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.76 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,79,735 ) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.