దేశంలో కొత్తగా 12,847 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసులు.. 43,270,577
మొత్తం మరణాలు..5,24,817
యాక్టివ్​ కేసులు.. 63,063
కోలుకున్నవారి సంఖ్య.. 4,26,82,697

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 12,847 మంది వైరస్​ బారినపడగా.. మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,985 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.64 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.15 శాతం వద్ద ఉంది.

కాగా, భారత్​లో గురువారం 15,27,365 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,95,84,03,471 కోట్లకు చేరింది. మరో 5,19,903 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. ఒక్కరోజే 5,62,029 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,368 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 54,30,32,268కు చేరింది. మరణాల సంఖ్య 63,37,911కు చేరింది. ఒక్కరోజే 4,15,821 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 518,146,962గా ఉంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/