దేశంలో కొత్త‌గా 10,126 క‌రోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కొత్త‌గా 10,126 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న 332 మంది ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, క్వారంటైన్ల‌లో 1,40,638 మందికి క‌రోనాకు చికిత్స అందుతోంది. కరోనా నుంచి నిన్న 11,982 మంది కోలుకున్నారు.

అలాగే, కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,37,75,086కు చేరుకుంది. క‌రోనాతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 4,61,389 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 59,08,440 డోసుల వ్యాక్సిన్ వేశారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 109,08,16,356 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/