వీర సింహా రెడ్డి ట్రైలర్కు ముహూర్తం ఫిక్స్
బాలకృష్ణ – శృతిహాసన్ జంటగా క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘వీర సింహ రెడ్డి’ . మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా తాలూకా సాంగ్స్ , వీడియోస్ రిలీజ్ చేస్తూ సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే జై బాలయ్య , సుగుణ , బావ మనోభావాలు సాంగ్స్ రిలీజ్ చేసి ఆకట్టుకున్న మేకర్స్..ఇప్పుడు ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్ చేసారు. జనవరి ఆరో తేదిన ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ను జరుపనున్నట్లు తెలుస్తుంది.
కాగా అదే రోజున ఈ సినిమా ట్రైలర్ను కూడా రిలీజ్ చేయనున్నారట. ఈ ప్రీ రిలీజ్ వేడుకను పెద్ద ఎత్తులో నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు పోటీగా రిలీజవుతున్న ‘వాల్తేరు వీరయ్య’ను కూడా మైత్రీ సంస్థే నిర్మించింది. ఇన్నేళ్ళ సినీ ఇండస్ట్రీలో మొట్ట మొదటి సారిగా ఒకే బ్యానర్లో తెరకెక్కిన సినిమాలు ఒకటి, రెండు రోజుల గ్యాప్లో రిలీజవడం ఇదే మొదటి సారి.