ఒక్కడు రీ-రిలీజ్ ట్రైలర్ రిలీజ్
మహేష్ బాబు ఒక్కడు రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేసారు. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా రాజకుమారుడు మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. ఆరంభం నుంచే టాలీవుడ్ యువరాజు. అయితే.. మహేష్ కు సూపర్ స్టార్ ఇమేజ్ ఆపాదించిన చిత్రం ఒక్కడు. 2003లో విడుదల అయిన ఒక్కడు.. మహేష్ కెరీర్ లో 7వ చిత్రం కాగా.. అంతకు ముందు రెండు ఫ్లాప్స్ తర్వాత వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ.. మహేష్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయింది.
మహేష్ బాబు.. జోడీగా నటించిన భూమిక అందం.. గుణశేఖర్ డైరెక్షన్.. ఎంఎస్ రాజు నిర్మాణ విలువలు.. మణిశర్మ పాటలు ఇలా ఎన్నో అంశాలు ఒక్కడు సక్సెస్ లో కీలక పాత్ర వహించాయి. ఒక్కడు మూవీలో దాదాపు 2 కోట్ల రూపాయలో చార్మినార్ సెట్ నిర్మించి.. చిత్రంలో పలు కీలక సన్నివేశాలను ఆ సెట్ చుట్టుపక్కల తీయడం.. ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఒక్కడు తర్వాతే ఇలా భారీ సెట్టింగులలో మెజారిటీ పార్ట్ షూటింగ్ అనే ట్రెండ్ మొదలైంది. ఈ చిత్రం 8 కేటగిరిల్లో నంది అవార్డులను గెలుచుకోగా.. ఫిలింఫేర్.. సినీ మా అవార్డులలో బెస్ట్ యాక్టర్ పురస్కారాన్ని అందుకున్నాడు మహేష్.
అలాంటి ఈ సూపర్ హిట్ ఫిలిం వచ్చే ఏడాది సంక్రాంతితో 20ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఒక్కడు సినిమాను మేకర్స్ రీ-రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా రీ-రిలీజ్కు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఇప్పుడున్న ట్రెండ్కు తగ్గట్లు ట్రైలన్ను బాగా కట్ చేశారు. మహేష్బాబు కట్ షాట్స్ బాగున్నాయి. చివర్లో వర్షంలో మహేష్బాబు కోపంతో చూస్తున్న షాట్ ట్రైలర్కే హైలైట్గా నిలిచింది. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్పై రూపొందిన ఈ సినిమాను జనవరి 7న 4కే వెర్షన్లో రిలీజ్ చేయనున్నారు.