పేదలు తమకు ఆత్మబంధువులు – మంత్రి హరీష్

పేదలు తమకు ఆత్మబంధువలని అన్నారు బిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు. పేదలకు సహాయం చేయడమే పరమావధిగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా సిద్దిపేటలోని సిఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని తెలంగాణ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి హరీష్ రావు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా క్రిస్మస్ పండుగను జరిపిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా రెండు రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణ బీఆర్ఎస్‌దేనని వెల్లడించారు. భారత దేశం భిన్నత్వంలో ఏకత్వమని, అన్నీ కులాలు, మతాలు కలిసి ఉన్న దేశమని తెలిపారు.