దారుణం : బాలానగర్ లో రూ. 400 కోసం హత్య

ఈరోజుల్లో హత్య చేయడానికి పెద్ద రిజనే అవసరం లేకుండా పోయింది. చిన్న చిల్లర పైసల కోసం కూడా హత్యలు చేస్తున్నారు. తాజాగా రూ. 400 ల కోసం హత్య చేసిన ఘటన హైదరాబాద్ లోని బాలానగర్ లో చోటుచేసుకుంది.

బాలానగర్ లో కాశీరాం, శ్రీనివాస్ అనే ఇద్దరు కూలీలుగా పనిచేస్తున్నారు. ఆదివారం వీరిద్దరి మధ్య డబ్బుల విషయంలో గొడవ జరిగింది. నర్సాపూర్ చౌరస్తా రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్ పై ఇద్దరు గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో తీవ్ర అగ్రహానికి గురైన కాశీరాం శ్రీనివాసుని కర్రతో కొట్టి విచక్షణా రాహిత్యంగా దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అటుగా వెళుతున్న లారీ కిందకు తోసేసాడు. లారీ కింద పడిన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన ప్రదేశానికి చేరుకొని , మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పటల్ కు తరలించి కేసు నమోదు చేసారు.