పురందేశ్వరిని మరోసారి టార్గెట్ చేసిన విజయసాయి

vijayasai-reddy-comments-on-purandeswari

అమరావతిః ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. కారంచేడు 145 బూత్ లో బిజెపికి కేవలం 6 ఓట్లు మాత్రమే పడ్డాయని… అసలు అక్కడ పురందేశ్వరికి ఓటు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. మీ సొంత పార్టీకి రాష్ట్ర బిజెపి అధ్యక్షుటు ఓటు వేయలేదా? అని అడిగారు. మీ బావ పక్షపాతివైన మీకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కంటగింపు అయిపోయిందని విమర్శించారు. బిజెపి లాంటి సిద్ధాంతాలు ఉన్న పార్టీలో… సిద్ధాంతాలను గాలికి వదిలేసే మీరు ఎన్ని రోజులు ఉంటారని ప్రశ్నించారు. గట్టిగా మాట్లాడితే… మా ఓటు అక్కడ లేదు, వైజాగ్ లోనో రాజంపేటలోనే ఉండిపోయిందని బొంకుతారని ఎద్దేవా చేశారు.