ఏపీలో రేపటి నుంచి కుల గణన ప్రక్రియ ప్రారంభం

ప్రయోగాత్మకంగా రెండు రోజుల పాటు నిర్వహణ

caste-census-to-be-started-in-andhra pradesh-by-tomorrow

అమరావతిః ఆంధ్రప్రదేశ్ లో కులగణన దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. బుధవారం నుంచి రాష్ట్రంలో రెండు రోజుల పాటు ప్రయోగాత్మకంగా కులగణన చేపట్టనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. బుధవారం నుంచి జిల్లా స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

ఐదు పట్టణాలలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ప్రజాభిప్రాయం మేరకు ఈ నెలాఖరు నుంచి పూర్తిస్థాయిలో కులగణన చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ నెల 17న రాజమండ్రి, కర్నూలు, 20న విశాఖపట్నం, విజయవాడ, 24న తిరుపతిలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొంది.