తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బిజెపి ధర్నాలు

BJP dharnas in all district centers across Telangana

Community-verified icon


కేసీఆర్ సర్కార్ చేపడుతున్న రాష్ట్ర రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా మంగళవారం బిజెపి ఆందోళనలకు పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో.. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

2018 ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తానని ఇచ్చిన హామీని కేసీఆర్ ప్రభుత్వం మరిచిపోయిందని, వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి కారణంగా రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.