ఏపీలో బాగున్న రోడ్లకు గుంతలు పెట్టి టీడీపీ డ్రామా చేస్తుంది – మంత్రి దాడిశెట్టి రాజా

టీడీపీ పార్టీ ఫై వైస్సార్సీపీ మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో బాగున్న రోడ్లకు గుంతలు పెట్టి టీడీపీ డ్రామా చేస్తుందని మండిపడ్డారు. బుధువారం రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఫై ఆయన స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, వేస్తున్న రోడ్లు చంద్రబాబు కు , పవన్ కళ్యాణ్ కు కనిపించడం లేదా..? గుడ్‌ మార్నింగ్‌ సీఎంసార్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ పెట్టి బాగున్న రోడ్లను తవ్వి నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. రోడ్లను బాగు చేయడం కోసం మా ప్రభుత్వం చిత్తశుద్ధి పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రంలోని రోడ్లపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.

రోడ్లు వేయడం అనేది నిరంతర ప్రక్రియ అని.. వర్షాకాలం తగ్గిన వెంటనే రోడ్లు వేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారన్నారు. అలాగే రోడ్ల మరమ్మతుల కోసం రూ. 1500 కోట్లు కేటాయించారని.. 2023 కల్లా రాష్ట్రంలో రోడ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై కూడా రాజా ఆగ్రహం వ్యక్తం చేసారు.

విశాఖలో ప్రజాగర్జన డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన అన్నారు. పవన్‌ డైవర్షన్‌ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని.. ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశ చరిత్రలో ఎవరికి ఇవ్వని చెప్పు దెబ్బ లాంటి తీర్పు పవన్‌కు ఇచ్చారని.. అయినా సిగ్గులేకుండా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ప్రవచనాలు చెప్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీ తీసుకుని ఆయన మాత్రమే బాగుంటే సరిపోతుందా.. ఐదు కోట్ల మందికి వారి భావనను తెలియపరచుకునే హక్కు లేదా అన్నారు.