తెలంగాణలో కొత్తగా 149 పాజిటివ్ కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,831..మొత్తం మృతుల సంఖ్య 1,612
346 new corona cases in Telangana
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 31,834 కరోనా పరీక్షలు నిర్వహించగా 149 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం… గత 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 186 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,831కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,92,415 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,612కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 1,804 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 694 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.