184 వ రోజుకు చేరిన ‘యువగళం’ పాదయాత్ర
రావెల శివారు క్యాంపు సైట్ వద్ద ‘సెల్ఫీ విత్ నారా లోకేష్’
Tadikonda: తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువ గళం’ పాదయాత్ర 184 వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం ఆయన రావెల శివారు క్యాంపు సైట్ వద్ద ‘సెల్ఫీ విత్ నారా లోకేష్’ లో పాల్గొన్నారు.. ప్రతిరోజూ వెయ్యి మందితో ఫోటోలు దిగుతున్నారు.
నియోజకవర్గం వ్యాప్తంగా తనను కలవటానికి వచ్చిన మహిళలు, యువత, వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగుతున్నారు. వారికోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి లోకేష్ ఫోటోలు దిగటం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రావెల శివారు నుంచి తన పాదయాత్ర కొనసాగించారు. మధ్యాహ్నం తాడికొండ శివారు విడిది కేంద్రం వద్ద ఆడిటర్లతో ముఖాముఖీ లో లోకేష్ పాల్గొంటారని పార్టీ శ్రేణులు తెలిపారు.
మహిళల ప్రత్యేకం ‘చెలి’ కోసం: https://www.vaartha.com/category/specials/women/