నేడు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం నిధులు జమ
![](https://www.vaartha.com/wp-content/uploads/2024/03/YSR-EBC-nestham.jpg)
ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్.. నేడు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 15 వేలు జమ చేయనుంది సర్కార్. సీఎం జగన్ గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలోనే బటన్ నొక్కి ఈబీసీ నేస్తం డబ్బులను మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఈ పథకంతో రూ.45 ఆర్థిక చేయూత అందిచనుంది జగన్ సర్కార్. 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న ఓసీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ప్రతి ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద ఈబీసీ, ఓసీ మహిళలకు మేలు జరగనుంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో పేద ప్రజలను ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకంతో పేద ఓసీ కుటుంబాలకు కూడా ఆర్థిక తోడ్పాటు అందివ్వనుంది. ఈ పథకంపై ఇప్పటికే ఆ వర్గానికి చెందిన ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు.