BRS కు కొత్త పేరు పెట్టిన వైస్ షర్మిల

ys-sharmila

YSRTP అధినేత్రి వైస్ షర్మిల ..BRS పార్టీ కి కొత్త పేరు పెట్టారు. BRS అంటే భారత్ రాష్ట్ర సమితి కాదని , బరాబర్ రైతు సావుకోరే పార్టీ అని అన్నారు. పార్టీ పెట్టినప్పటి నుండి కేసీఆర్ సర్కార్ ఫై విమర్శలు చేస్తూ వస్తున్న షర్మిల.. తాజాగా యాసంగి పంటను కొనకుండా కల్లాల కాడనే రైతులను కాటికి పంపుతున్నాడని సీఎం కేసీఆర్ ఫై మండిపడ్డారు. రెండు నెలలైనా వడ్లు కొంటలేరని, రోడ్లపై పడి ధర్నాలు చేస్తున్నా.. ఐకేపీ సెంటర్ల ముందే పారబోసి ధాన్యాన్ని కాలబెడుతున్నా.. దొరకు చీమ కుట్టినట్లైనా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు అరిగోస పడుతున్నా.. ఒక రివ్యూ లేదు.. కనీసం దొర ఆరా తీసింది లేదన్నారు.

ఒక మంత్రి తాలు కాలబెట్టి నాటకాలా అంటూ అపహస్యం చేస్తున్నారని మండిపడ్డారు. మరో మంత్రి 50 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నమని,రికార్డ్ అంటూ జబ్బలు చర్చుకుంటున్నడని విమర్శించారు. “1.30 లక్షల టన్నుల ధాన్యం పండితే సగం కొనక పోవడం రికార్డ్ అంటరా..? పోనీ మీరు చెప్పిన 80 లక్షల టన్నులకు 50 లక్షల టన్నులు కొనడం గొప్ప విషయమా..? రెండు నెలల్లో 50 లక్షల టన్నులు కొన్న మీరు.. వారం రోజుల్లో వస్తున్న వర్షాకాలానికి 30 లక్షల టన్నులు కొనగలరా..? అంతా పచ్చి అబద్ధాలు..బూటకపు మాటలు. ధాన్యం కొనడం చేతకాక, రికార్డులు అని భజన చేయడం ఒక్కటే భజన బ్యాచ్ కి తెలుసు అని షర్మిల అన్నారు.