మహిళా కమిషన్ ఫై వైస్ షర్మిల ఫైర్

YSRTP అధినేత్రి వైస్ షర్మిల..తెలంగాణ మహిళా కమిషన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పలు వ్యాఖ్యలు చేసారని సుమోటోగా స్వీకరించడం సంతోషం కలిగించిందని , కానీ అదే మేము మీకు వందలసార్లు కంప్లైంట్ చేస్తే ఎందుకు స్పందించలేదు? ఎందుకు చలనం రాలేదు? అని మహిళా కమిషన్ ను నిలదీశారు.

“నేను ముఖ్యమంత్రి బిడ్డను కాదనా? లేక సాధారణ మహిళల కోసం మీ కమిషన్ పనిచేయదా? మంత్రి నిరంజన్ రెడ్డి ఒక మహిళను పట్టుకుని మంగళవారం మరదలు అంటే మీకు కనబడలేదు. కేటీఆర్ వ్రతాలు చేసుకోండి అంటే మీకు కనబడలేదు. ఒక ఎమ్మెల్యే అనుచరులు మాపై దాడి చేస్తే మీకు కనబడలేదు. మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్న అధికార పార్టీ మాటలు మీకు వినపడవు… వారి అకృత్యాలు కనబడవు… వారు చేసే అత్యాచారాలు కనబడవు. కానీ ముఖ్యమంత్రి బిడ్డ మీద చీమ వాలేసరికి మీకు బాధ్యత గుర్తుకు వస్తుంది. ఎందుకంటే మీది మహిళల కోసం పనిచేసే కమిషన్ కాదు.

మీది బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే కమిషన్… బీఆర్ఎస్ కమిషన్… బీఆర్ఎస్ పార్టీలోని మహిళల కోసం మాత్రమే పనిచేసే కమిషన్. నిజంగా మీది మహిళల కోసం పనిచేసే కమిషన్ అయితే… మీకు ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించి బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోండి” అంటూ షర్మిల డిమాండ్ చేశారు.