ఏకంగా స్కూల్ నే ఇంటిగా మార్చుకున్న వైస్సార్సీపీ నేత

ఏపీలో వైస్సార్సీపీ నేతల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయని..అధికారం చేతిలో ఉన్నదని ఎంతకైనా తెగిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నప్పటికీ..వారి ఆగడాలను ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. ఖాళీగా కనిపిస్తే స్థలాన్నే కాదు ఏకంగా స్కూల్ ను సైతం వదిలిపెట్టలేదు. తాజాగా అధికారపార్టీకి చెందిన నేత..ఎకానగ స్కూల్ నే తన ఇంటిగా మార్చుకున్న ఘటన పాణ్యంలోని ఇందిరా నగర్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా పాణ్యంలోని ఇందిరా నగర్ లో చెంచు గిరిజన విద్యార్థుల కోసం ప్రభుత్వం 2013లో రూ. 5.30 లక్షలతో పాఠశాలను నిర్మించింది. అయితే ఆ స్కూల్లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉందనే కారణంతో దాన్ని మూసేశారు. ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులను వేరే స్కూల్ కు తరలించారు. ఈ క్రమంలో, ఆ స్కూల్ ను స్థానిక వైస్సార్సీపీ నేత ఒకరు ఆక్రమించుకున్నారు. అంతేకాక, తాను అందులో నివసేంచేందుకు వీలుగా బిల్డింగ్ లో మార్పులు కూడా చేయించుకున్నారు. దీనిపై స్థానికులు కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.